Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 3 లక్షలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (09:46 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు ఈ కేసుల సంఖ్య 2.5 లక్షలకు చేరుకున్నాయి. సోమవారం లెక్కలతో పోల్చితే మంగళవారం 50 వేలు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ముఖ్యంగా, కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని తెలిపింది. 
 
తాజా ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసులు 3,97,99,202కు  చేరుకున్నాయి. ఇందులో 22,36,842 యాక్టివ్ కేసులు ఉండగా 4.90.462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, ఆది, సోమవారాల్లో కలిపి 614 మంది చనిపోయారు. 2,67,753 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులే ఉండటం గమనార్హం. బీఎంసీ పరిధిలో 280 మంది వద్ద సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించగా ఇందులో 89 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌గా గుర్తించారు. కేవలం 8 శాతం మాత్రమే డెల్టా వేరియంట్స్, 3 శాతం డెల్టా వైరస్, ఇతర లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments