Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ ఎఫెక్ట్... పెరిగిపోతున్న పెండ్లికాని ప్రసాద్‌లు, పెండ్లికాని మిస్సమ్మలు

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:28 IST)
గత ఏడాది సరిగ్గా ఈ సమయానికి పెళ్ళిళ్ల సీజన్‌లోనే లాక్ డౌన్ పడి చాలా వరకు లగ్గాలు ఆగిపోయాయి. దీంతో వీటిపై ఆధారపడిన చాలామంది జీవనోపాధి కోల్పోయారు. టెంట్ హౌజ్, బ్యాండ్ మేళం, మేకప్ ఆర్టిస్టులు, డెకరేషన్, వంట వాళ్లు.. ఇలా ఒక్క టేమిటి పెళ్లిల్లు, ఫంక్షన్ల బిజినెస్ లు మొత్తం కుప్పకూలాయి. 
 
చాలా మంది రోడ్డున పడ్డారు. ఇక ఫస్ట్ వేవ్ తగ్గింది కదా ఈ సారి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది అనుకునే టైమ్ కు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు.
 
కరెక్ట్‌గా మళ్లీ ఇదే టైమ్‌లో కరోనా తీవ్ర స్థాయిలో రావడంతో పెళ్లిల్లు మళ్లీ వాయిదా పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పెండ్లికాని ప్రసాద్‌లు, పెండ్లికాని మిస్సమ్మలు ఏటేటా పెరిగిపోతున్నారు. ఇక ఏదేమైనా సరే అని కొందరు సింపుల్‌గా పెండ్లి చేసుకుంటున్నా.. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. 
 
ఎందుకంటే పెండ్లి అనేది ఒకే సారి చేసుకుంటాం కాబట్టి.. కోవిడ్ తగ్గాకే గ్రాండ్ గా చేసుకుందాం అని అనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఇప్పుడు పెళ్లిల్లు ఫిక్స్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో.. వారందరికీ పెళ్లిల్లు ఎప్పుడు అవుతాయో అంటూ వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments