దేశంలో పెరిగిపోతున్న క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:36 IST)
దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా 20 వేలకు పైగా నమోదైన ఈ కేసులు మూడోరోజైన శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.40 లక్షలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,17,895 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,660కి చేరింది. ఇకపోతే, 18,301 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.48 శాతం) దాటింది.
 
వైరస్‌వ్యాప్తి పెరుగుతుండటం.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,40,760(0.32 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతూ 200 కోట్ల డోసులకు చేరువ కావడం విశేషం. ఇప్పటి వరకూ 199,71,61,438 డోసులు పంపిణీ చేశారు.
 
మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments