Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా జోరు : కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 6 మే 2020 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 7782 శాంపిల్స్‌ను పరీక్షించగా, అందులో 60 పాజిటివ్ కేసులుగా తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1777కు పెరిగాయి. ఇందులో 729 మంది డిశ్చార్జ్ గాకా, మరో 1012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు అలాగే, 36 మంది చనిపోయారు. కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా ఉన్నాయి.
 
ఇకపోతే జిల్లా వారీగా మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 80, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 46, గుంటూరు 363, కడప 90, కృష్ణ 300, కర్నూలు 533, నెల్లూరు 92, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 39, వెస్ట్ గోదావరి 59 చొప్పున నమోదు కాగా, గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 28 మంది వలస కూలీలకు ఈ వైరస్ సోకింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments