Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా జోరు : కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 6 మే 2020 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 7782 శాంపిల్స్‌ను పరీక్షించగా, అందులో 60 పాజిటివ్ కేసులుగా తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1777కు పెరిగాయి. ఇందులో 729 మంది డిశ్చార్జ్ గాకా, మరో 1012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు అలాగే, 36 మంది చనిపోయారు. కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు, ఆ తర్వాత గుంటూరు, కృష్ణా ఉన్నాయి.
 
ఇకపోతే జిల్లా వారీగా మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 80, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 46, గుంటూరు 363, కడప 90, కృష్ణ 300, కర్నూలు 533, నెల్లూరు 92, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 39, వెస్ట్ గోదావరి 59 చొప్పున నమోదు కాగా, గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 28 మంది వలస కూలీలకు ఈ వైరస్ సోకింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments