లాక్డౌన్ డిసెంబరు 31 వరకు పొడగింపు... ముఖ కవచం తప్పనిసరి!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (13:17 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను డిసెంబరు నెలాఖరు వరకు పొడగించింది. దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అవుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
 
అయితే పలు ఆంక్షలను సడలించింది. బీచ్‌ల‌ను ప‌బ్లిక్‌కు ఓపెన్ చేశారు. యూజీ, పీజీ కాలేజీల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. రాజ‌కీయ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కూడా కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. వీటన్నింటికీ ఖచ్చితంగా కోవిడ్ నియమావళిని విధిగా పాటించాల్సివుంది. 
 
ఇకపోతే, ప్ర‌జ‌లు ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. క్రీడా శిక్ష‌ణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమ‌తి ఇచ్చారు. డిసెంబ‌ర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. 
 
కాగా, ప్రస్తుతం చెన్నై మహానగరంతో పాటు.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెల్సిందే. అయినప్పటికే, దేశంలో ఈ కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్‌ను 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments