Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కోరల నుంచి 92.97 శాతం మంది బయటపడి ఇళ్లకు చేరుకున్నారు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (19:44 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదు కావడం, క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపులో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశాలు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది.
 
అలాగే, శుక్రవారం క్రియాశీల కేసుల సంఖ్య 4,80,719 గా ఉండగా.. ఆ రేటు 5.55 శాతానికి తగ్గింది.
ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 81,63,572 (92.97శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 47,992 గా ఉంది.
 
ఈ మహమ్మారి కారణంగా శుక్రవారం 520 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 1,29,188 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ప్రభుత్వం 9,29,491 నమూనా పరీక్షలు నిర్వహించింది. దాంతో ఇప్పటివరకు 12,40,31,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments