Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ స్ట్రెయిన్ కలకలం..

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (13:07 IST)
తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్‌ మండలం తేటగుంట గ్రామంలో గురువారం కోవిడ్‌ స్ట్రెయిన్‌ కలకలం రేపింది. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. మరలా మార్చి 1న తుని లో పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇతనిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
అలాగే దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజు 14,989 కేసులు నమోదయ్యాయి. వీటితో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 1.11 కోట్లకు పైగా చేరాయి. కొత్తగా 89మంది మరణించారు. మొత్తం నిన్నటివరకు కరోనా కారణంగా 1,57,435 మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే 14,031 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనాను జయించినవారు 1.08 కోట్లకు పైబడగా.. ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న 7,75,631 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments