Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విశ్వరూపం.. హోం ఐసోలేషన్‌కు కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (10:58 IST)
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిది. రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్‌-19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. హోం ఐసోలేషన్‌ నుంచి 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 
 
కొత్త మార్గదర్శకాలు ఇవే..
 
* స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేని రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించాలి.
* రోగులు ఇంటికే పరిమితమవ్వాలి. బయటకు రావడానికి వీల్లేదు. 
* ఐసోలేషన్‌లో ఉండేవారికి సహాయం అందించేందుకు అన్నివేళలా సహాయకుడు ఉండాలి.
* ఐసోలేషన్‌ ముగిసేంతవరకూ రోగికి సంబంధించిన చికిత్స కోసం కేర్‌టేకర్‌కు, ఏదైనా దవాఖానా సిబ్బందికి మధ్య అనుసంధానం ఉండాలి. 
* రోగుల ఆక్సిజన్‌ స్థాయిలు ఎప్పటికప్పుడు పరీక్షించాలి.
* 60 ఏండ్లు పైబడిన వారిని, రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, సెరెబ్రో-వస్కులర్‌ వ్యాధులు ఉన్నవారిని వైద్యులు అనుమతించిన తర్వాతనే హోంఐసోలేషన్‌లో ఉంచాలి.
* రోగికి సాయం చేసే కేర్‌టేకర్‌, కుటుంబ సభ్యులు.. వైద్యుల సలహాతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ప్రోపిలాక్సీస్‌ ఔషధాలను వాడాలి.
 
కరోనా లక్షణాలు ఉన్న రోగులు... 
* రోగులు గోరువెచ్చని నీటిని పుక్కిలించడం, రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం చేయాలి.
* ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు సంబంధిత వైద్యుని సలహాతో మందులు వాడాలి.
* రోజుకు 4 సార్లు పారాసెటమాల్‌ 650 ఎంజీ వాడినప్పటికీ జ్వరం తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించాలి. 
* నాన్‌-స్టెరాయిడల్‌ యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ డ్రగ్‌ (ఎన్‌ఎస్‌ఏఐడీ)లు వైద్యుల సూచన మేరకు వాడొచ్చు. 
* బాధితులు, కేర్‌టేకర్లు మూడు పొరల మాస్కు వాడకం తప్పనిసరి. రోగులు వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలి.
* తేలికపాటి లక్షణాలుంటే నోటి ద్వారా స్టెరాయిడ్లు తీసుకోవద్దు. వారం రోజులైనా జ్వరం, దగ్గు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
* 10 రోజుల అనంతరం హోంఐసోలేషన్‌ నుంచి బయటకు రావొచ్చు. చివరి మూడు రోజుల్లో జ్వరం లేకపోతే పరీక్ష అవసరంలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments