గుంటూరులో నిబంధనలతో కూడిన లాక్‌డౌన్, ఇక్కడ మాత్రమే ఎందుకని?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. కేసులతో పాటు మరణాలు కూడా అధికమవుతున్నాయి. ఏపీలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు 5000 మందికి పైగా కరోనా వ్యాధి బారినపడ్డారు.
 
వీరిలో 1829 మంది కరోనా మహమ్మారిని జయించగా ఇప్పటివరకు 32 మంది కరోనాకు బలైపోయారు. ఈ క్రమంలో కరోనాను అడ్డుకోవడానికి శనివారం నుండి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ వెల్లడించారు. నిత్యావసర సరకుల కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి కలదని స్పష్టం చేసారు.
 
ఇలా పూర్తిగా వారం రోజులపాటు లాక్ డౌన్ ఉంటుందని, అవసరమైతే తప్ప మిగతా విషయాలకు బయటకురావద్దని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments