Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమైక్రాన్‌ రూపంలో.. థర్డ్ వేవ్ ముప్పు వస్తోందా?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:13 IST)
ఒమైక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చేసిందని టాక్ వస్తోంది. అలాగే డెల్టాను మించిన వేరియంట్‌ వస్తేనే దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు హెచ్చరించారు. ఒమైక్రాన్‌ రూపంలో అలాంటిది వచ్చిందనే ఆందోళన కనిపిస్తోంది. 
 
గత పరిస్థితులను బేరీజు వేసి ఒమైక్రాన్‌ ప్రభావం మనపైనా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 11న ఒమైక్రాన్‌ను గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే.. చాలా ప్రమాదకారి రకంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కొవిడ్‌ వేరియంట్‌లలో దేన్నీ ఇంత తక్కువ కాలంలో అలా పేర్కొనలేదు. కేవలం వారం వ్యవధిలో ఒమైక్రాన్‌ వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది.  కాబట్టే.. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
 
దేశంలో సెకండ్‌ వేవ్‌లో డెల్టా కారణంగానే 2.5 కోట్ల కేసులు నమోదై, 2 లక్షలపైగా మరణాలు సంభవించాయి. ఒమైక్రాన్‌ వ్యాపిస్తే ముప్పు మరింత ఎక్కువని ఆందోళన వ్యక్తమవుతోంది.
 
డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం, విమాన సర్వీసులపై దేశాలు ఆంక్షలు విధిస్తుండడం బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసిపోతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments