Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమైక్రాన్‌ రూపంలో.. థర్డ్ వేవ్ ముప్పు వస్తోందా?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:13 IST)
ఒమైక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చేసిందని టాక్ వస్తోంది. అలాగే డెల్టాను మించిన వేరియంట్‌ వస్తేనే దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు హెచ్చరించారు. ఒమైక్రాన్‌ రూపంలో అలాంటిది వచ్చిందనే ఆందోళన కనిపిస్తోంది. 
 
గత పరిస్థితులను బేరీజు వేసి ఒమైక్రాన్‌ ప్రభావం మనపైనా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 11న ఒమైక్రాన్‌ను గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే.. చాలా ప్రమాదకారి రకంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కొవిడ్‌ వేరియంట్‌లలో దేన్నీ ఇంత తక్కువ కాలంలో అలా పేర్కొనలేదు. కేవలం వారం వ్యవధిలో ఒమైక్రాన్‌ వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది.  కాబట్టే.. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
 
దేశంలో సెకండ్‌ వేవ్‌లో డెల్టా కారణంగానే 2.5 కోట్ల కేసులు నమోదై, 2 లక్షలపైగా మరణాలు సంభవించాయి. ఒమైక్రాన్‌ వ్యాపిస్తే ముప్పు మరింత ఎక్కువని ఆందోళన వ్యక్తమవుతోంది.
 
డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం, విమాన సర్వీసులపై దేశాలు ఆంక్షలు విధిస్తుండడం బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసిపోతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాలోని కాంతార కాంతార.. సాంగ్ రిలీజ్ చేసిన నిఖిల్

సూపర్‌ ఏజెంట్స్ గా ఆలియాభట్‌, శార్వరి నటిస్తున్న ఆల్ఫా చిత్రం క్రిస్మస్‌ కు సిద్దం

దేవర కలెక్లన్ల కోసం దావుడి పాటను యాడ్ చేశారు

కిరణ్ అబ్బవరం క సినిమా నుంచి మాస్ జాతర సాంగ్ సిద్దమవుతోంది

విజయ్‌ సినీ కెరీర్‌లో ఆఖరి సినిమా దళపతి 69 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments