Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసి గుప్పెట్లో కర్నూలు - కొత్తకా మరో 31 కేసులు

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరోనా రక్కసి గుప్పెట్లో చిక్కుకున్నట్టుగా ఉంది. తాజాగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఈ కేసులన్నీ బయటపడ్డాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 80 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
కొత్తగా నమోదైన 80 కేసుల్లో ఒక్క కర్నూలులోనే 31, గుంటూరులో 18, చిత్తూరు జిల్లాలో 14, అనంతపురంలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒక కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో రాష్ట్రంలో కరోనా 893కి చేరింది.
 
కొన్ని రోజులుగా ఏపీలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతానికి పైగా కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. 
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 725గా ఉంది. 141 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
జిల్లా వారీగా నమోదైన కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 42, చిత్తూరు 73, ఈస్ట్ గోదావరి 32, గుంటూరు 195, కడప 51, కృష్ణా 88, కర్నూలు 234, నెల్లూరు 67, ప్రకాశం 50, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరి 39 చొప్పున నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments