Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, విషమంగా మారిన డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోగ్యం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:48 IST)
లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ కోవిడ్ 19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనావైరస్‌తో పాటు డెంగ్యూతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్, డెంగ్యూ కారణంగా సిసోడియా ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. ఆయన రక్త ప్లేట్‌లెట్లు కూడా పడిపోతున్నాయని కూడా తెలిపింది.
 
సిసోడియా బుధవారం ప్రభుత్వ ఎల్ఎన్జెపి ఆస్పత్రిలో చేరారు. జ్వరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆయన చికిత్స కోసం చేరినట్లు తెలిపింది. అయితే తాజాగా సిసోడియాను మెరుగైన వైద్యం కోసం ఎల్ఎన్‌జెపి హాస్పిటల్ నుంచి సాకేత్ లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు ఆస్పత్రి హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
 
సెప్టెంబరు 14న మనీష్ సిసోడియా కరోనా బారిన పడ్డారు. దాంతో అప్పటి నుంచి సెల్ప్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని మంత్రివర్గంలో కోవిడ్ 19కు పాజిటివ్‌గా పరీక్షించిన రెండవ మంత్రి మనీష్ సిసోడియా, జూన్‌లో డిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరారు. 12 రోజుల పాటు చికిత్స పొంది జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments