Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా జోరు : మరో 67 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 4 మే 2020 (13:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరో 67 మందికి ఈ వైరస్ సోకింది. వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో 10,292 శాంపిళ్లను పరీక్షించగా 67 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, ఇప్పటివరకు 524 మంది ఆస్పత్రుల నుంచి ఇంటికివెళ్లగా, మరో 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. 
 
ఇకపోతే, రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.
 
ఇక జిల్లాల వారీగా మొత్తం కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 78, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 45, గుంటూరు 338, కడప 87, కృష్ణ 278, కర్నూలు 491, నెల్లూరు 91, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 35, విజయనగరం 0, వెస్ట్ గోదావరి 59 చొప్పున మొత్తం 1650 కేసులు నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments