ఏపీలో కరోనా మృత్యుఘంటికలు : 24 గంటల్లో 68 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 68 మంది చనిపోయారు. అలాగే కొత్త కేసుల నమోదులో కూడా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతి రోజూ ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10,175 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1,412 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,386 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,37,687కి పెరిగింది. ఇదేసమయంలో గత 24 గంటల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,702 మంది కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 72,229 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం జి్లాలో 4966 కేసులు ఉండగా, చిత్తూరులో 8747, ఈస్ట్ గోదావరిలో 12763, గుంటూరులో 7803, కడపలో 7942, కృష్ణలో 3051, కర్నూలులో 4438, నెల్లూరులో 5782 చొప్పున ఉన్నాయి.
 
అలాగే, ప్రకాశంలో 15099, శ్రీకాకుళంలో 6657, విశాఖపట్టణంలో 6023, విజయనగరంలో 9314, వెస్ట్ గోదావరిలో 4663 చొప్పున మొత్తం 97338 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4702 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments