Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ కాలేజ్ సిబ్బందికి గుడ్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:52 IST)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందికి జీతాలను పెంచుతూ ఉకత్తర్వులు జారీచేసింది. బోధనా సిబ్బందికి జీతాలు పెంచాలనే నిర్ణయం గత నాలుగున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే కొన్ని రోజులు క్రితమే గాంధీ ఆసుపత్రి వైద్యులు, అలాగే ఇతర సిబ్బంది కూడా తమ జీతాలు పెంచాలనే డిమాండుతో సమ్మెలో దిగారు.
 
కాగా వారి డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వారి జీతాలను 24 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాసుపత్రిలో సుమారు 2,860 మంది అధ్యాపకులు ఉండగా వీరందరి వేతనాలు పెరిగాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే రివిజన్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గురువారం ఉత్తర్వులు ప్రకారం పెరిగిన జీతాలు ఈ నెల నుండి నగదు రూపంలో చెల్లించబడుతాయి. జీతాల వివరాలు... అసిస్టెంట్ ప్రొఫెసర్ 67,000 నుంచి 90, 000, అసోసియేట్ ప్రొఫెసర్ 80,000 నుంచి 1,00,000, ప్రొఫెసర్ 1,25,000 నుంచి 1,80,000గా పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments