Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటార్కిటికాలో తొంగిచూసిన కరోనా.. 58మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:21 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కానీ ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకు వణికితే ఒక్క ఖండం మాత్రమె ఆ టెన్షన్ లేకుండా ఉంది. అదే అంటార్కిటికా. ఇప్పటి దాకా ఆ ఖండం మీద ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ఈ ఖండంలో శాశ్వతంగా ఎవరూ నివసించరు. కొద్ది మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే అక్కడ ఉంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. అది ఒకటి రెండు కాదు ఏకంగా 58 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా కథనాలు వెలువరించింది.
 
ఇక నివారణ చర్యలు చేపట్టామని కూడా చిలీ ఆర్మీ ప్రకటన చేసింది. రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వారి ద్వారానే ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కోంది. కరోనా కేసులు నమోదు కావడంతో అంటార్కిటికాలోని అన్ని ప్రధాన రీసెర్చ్ ప్రాజెక్టులను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments