తెలుగు వారికి గుడ్ న్యూస్ చెప్పిన మమత బెనర్జీ..!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:15 IST)
తెలుగు వారికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాషా హోదా ఇస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్‌లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'మినీ ఆంధ్రా'గా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకునేందుకు మమత సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని వారంతా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ మేరకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments