Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విముక్త రాష్ట్రంగా గోవా ... పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్‌లే...

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:53 IST)
దేశంలో కరోనా విముక్త రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులన్నీ ఇపుడు నెగెటివ్ కేసులుగా తేలాయి. దీంతో ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన రోగులంతా కోలుకున్న తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. 
 
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, రోగులకు చికిత్సలు అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు, వారితో కలిసి నడిచిన హెల్త్ వర్కర్లకు చాలా రుణపడివుంటాం. ఈ ఘనత వైద్యుల శ్రమ, కృషితోనే సాధమైంది' అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటిస్తూ, ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. సామాజిక దూరాన్ని ప్రజలు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్‌‌లైన్స్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. గోవాను కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ం చీఫ్ సెక్రటరీ పరిమల్ రాయ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి నీలా మోహనన్ తదితరులు చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments