Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌పై సైబర్ దాడి... ర్యాన్సమ్ వేర్‌తో అటాక్

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:43 IST)
దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‍‌డౌన్ అమలవుతోంది. దీంతో అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించాయి. అయితే, సైబర్ నేరగాళ్ళకు ఇపుడు ఇదే ఓ అవకాశంగా దొరికింది. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సైబర్ దాడికి గురైంది. 
 
ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది ఉద్యోగులతో 15 బిలియన్ డాలర్ల సంపదతో అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న ఈ సంస్థ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థలపై శుక్రవారం రాత్రి సైబర్ దాడి జరిగిందని, హ్యాకర్లు ర్యాన్సమ్ వేర్‌ను చొప్పించారని కాగ్నిజెంట్ వర్గాలు వెల్లడించాయి. దీన్ని మేజ్ ర్యాన్సమ్ వేర్ అటాచ్ మెంట్‌గా కాగ్నిజెంట్ పేర్కొంది. ఈ దాడి కారణంగా వినియోగదారుల సేవలకు కొంత అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. 
 
అయితే, ఈ సైబర్ దాడి పర్యవసానాలను ఎదుర్కొనేందుకు తమ భద్రత నిపుణుల బృందం రంగంలోకి దిగిందని, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దీనిపై సమాచారం అందించామని వివరించింది. అంతేకాకుండా, సైబర్ దాడి విషయాన్ని తమ వినియోగదారులకు వెల్లడించామని, తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలను వారికి తెలియజేశామని కాగ్నిజెంట్ ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments