Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:42 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారిగా నమోదు అవుతున్న సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. గడిచిన రెండు నెలల్లో వైరస్ కేసుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. 
 
సెప్టెంబర్‌లో వైరస్ కేసులు పెరిగిన తర్వాత.. 70 వేల కన్నా తక్కువ కేసులు వరుసగా నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో వైరస్ వల్ల 706 మంది చనిపోయారు. 71,75,881 పాజిటివ్ కేసుల్లో.. ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 62,27,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,09,856కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
అలాగే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1708 పాజిటివ్ కేసులు నమోదుకాగా 5 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,14,792కి చేరింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 24,208 యాక్టివ్ కేసులుండగా 1,89,351 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1233 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, భద్రాద్రి కొత్తగూడెంలో 97, కరీంనగర్లో 86,ఖమ్మం లో 81, మేడ్చల్ లో 124, నల్గొండలో 81, రంగారెడ్డిలో 137 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments