Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్.. కొత్తగా 11,039 కేసులు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:37 IST)
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 11,039 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. 
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,77,284కు పెరిగింది. మరో 12,255 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,62,631 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
వైరస్‌ ప్రభావంతో కొత్తగా 110 మంది మరణించగా.. మొత్తం 1,54,596 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,60,057 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 41,38,918 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments