Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:21 IST)
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తున్నాయి. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 96,551 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 45లక్షల 62వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 35లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 43వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
ఇక దేశంలో కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1209 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 76,271కి చేరింది. అయితే, కోవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.
 
దేశంలో నిత్యం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో, అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. నిన్న ఒక్కరోజే 11లక్షల 63వేల కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 5కోట్ల 40లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments