Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మోసం చేశాడు.. పిల్లలకు మత్తు మందు ఇచ్చి నిప్పంటించి.. ఆపై ఆమె కూడా?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:17 IST)
భర్త వేరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. ఆమె కోసం తనను వదిలేశాడన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేరే యువతితో వెళ్లిపోయాడని మనస్థాపానికి గురైన భార్య ముందుగా తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తరవాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడు అరంతాంగిలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని వల్లంబాక్కం కాడులో ముత్తు(45), రాధ(34) దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ముత్తు కొంతకాలంగా అరంతాంగిలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న రత్న కోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. భార్య పలు మార్లు మందలించినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు.
 
అంతే కాకుండా విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ విద్యార్థినితో పరార్‌ అయ్యాడు. సమాచారంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధను ప్రశ్నించడమే కాకుండా, ముత్తుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. భార్య చేష్టలకు విసిగిపోయింది.
 
అవమానంగా భావించిన రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిల్లలకు మత్తు మందు ఇచ్చి వారికీ నిప్పంటించింది. అనంతరం తానూ అగ్నికి ఆహుతయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments