Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఎగబాకిన భారత్

Webdunia
సోమవారం, 6 జులై 2020 (09:03 IST)
కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆ స్థానంలో రష్యా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యా మొత్తం 6.8 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉండేది. అయితే, భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఆదివారానికి భారత్‌లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 6.9 లక్షలకు చేరింది. ఫలితంగా మూడో స్థానంలో నిలించింది. భారత్ కంటే ముందు స్థానాల్లో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తం 28 లక్షల కేసులు నమోదైవుండగా, బ్రెజిల్‌లో 15 లక్షల కేసులు ఉన్నాయి. 
 
కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తర్వాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 
 
ఇదేసమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments