Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఎగబాకిన భారత్

Webdunia
సోమవారం, 6 జులై 2020 (09:03 IST)
కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆ స్థానంలో రష్యా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యా మొత్తం 6.8 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉండేది. అయితే, భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఆదివారానికి భారత్‌లో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 6.9 లక్షలకు చేరింది. ఫలితంగా మూడో స్థానంలో నిలించింది. భారత్ కంటే ముందు స్థానాల్లో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తం 28 లక్షల కేసులు నమోదైవుండగా, బ్రెజిల్‌లో 15 లక్షల కేసులు ఉన్నాయి. 
 
కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తర్వాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 
 
ఇదేసమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments