కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ వ్యాధి కేవలం ధనవంతుల వ్యాధి అని, ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ కరోనా వైరస్‌ను ధనవంతులే రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పైగా, ఈ వైరస్ ధనవంతులకే సోకుతుందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిచన వారి ద్వారానే ఈ వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని ఆయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
 
కాగా, తమిళనాడులో గురువారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments