Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ వ్యాధి కేవలం ధనవంతుల వ్యాధి అని, ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ కరోనా వైరస్‌ను ధనవంతులే రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పైగా, ఈ వైరస్ ధనవంతులకే సోకుతుందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిచన వారి ద్వారానే ఈ వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని ఆయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
 
కాగా, తమిళనాడులో గురువారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments