Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో నెలరోజుల పాటు లాక్ డౌన్.. ఒక్కరోజే 606 మంది మృతి

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (08:54 IST)
Newyork
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు ఆరు లక్షలా 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఏకంగా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఒక్క న్యూయార్క్‌లోనే ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 11,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మే 15 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో ప్రకటించారు. 
 
గడిచిన 24 గంటల్లో అంటే ఒకే రోజు ఏకంగా 606 మంది ప్రజలు కరోనాతో మృతి చెందారని చెప్పారు. అయితే గత పది రోజులుతో పోలిస్తే ఇది తక్కువ ప్రాణ నష్టమేనని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను నెల రోజుల పాటు విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని లేదంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక న్యూయార్క్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో.. న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాలకు 100 చొప్పున వెంటిలేటర్లను అందజేయాలని గవర్నర్ ఆండ్రూ కువోమో నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments