న్యూయార్క్‌లో నెలరోజుల పాటు లాక్ డౌన్.. ఒక్కరోజే 606 మంది మృతి

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (08:54 IST)
Newyork
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు ఆరు లక్షలా 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఏకంగా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఒక్క న్యూయార్క్‌లోనే ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 11,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మే 15 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో ప్రకటించారు. 
 
గడిచిన 24 గంటల్లో అంటే ఒకే రోజు ఏకంగా 606 మంది ప్రజలు కరోనాతో మృతి చెందారని చెప్పారు. అయితే గత పది రోజులుతో పోలిస్తే ఇది తక్కువ ప్రాణ నష్టమేనని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను నెల రోజుల పాటు విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని లేదంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక న్యూయార్క్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో.. న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాలకు 100 చొప్పున వెంటిలేటర్లను అందజేయాలని గవర్నర్ ఆండ్రూ కువోమో నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments