Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా తగ్గుముఖం.. 9వేలకు దిగువన కేసులు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (12:54 IST)
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు 9 వేలకు దిగువన నమోదవ్వడం ఊరట కలిగించే అంశం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 11,07,617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,865 కేసులు బయటపడ్డాయి. 
 
తొమ్మిది నెలల కనిష్ఠానికి కేసుల సంఖ్య చేరింది. తాజాగా 197 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 3,44,56,401 మంది కరోనా బారిన పడగా... ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,852కి చేరింది. 
 
కేరళ రాష్ట్రం నుంచే 4,547 కేసులు..57 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 11,971 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.27 శాతానికి చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,30,793కి తగ్గి.. యాక్టివ్‌ కేసుల రేటు 0.38 శాతానికి పడిపోయింది. సోమవారం ఒక్కరోజే 59,75,469 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments