దేశంలో విజృంభిస్తోన్న కోవిడ్: 24గంటల్లో కొత్తగా 68వేల కేసులు

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (10:55 IST)
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్‌ తర్వాత ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది. ఇందులో 1,13,55,993 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 1,61,843 మంది మరణించారు.
 
కాగా, కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో దేశంలో యాక్టివ్‌ కేసులు ఐదు లక్షలు దాటాయి. మొత్తం కేసుల్లో 5,21,808 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఆదివారం మహమ్మారి వల్ల 291 మంది మరణించగా, మరో 32,231 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 6,05,30,435 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించింది.
 
దేశ వ్యాప్తంగా 24,18,64,161 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో మార్చి 28న 9,13,319 నమూనాలను పరీక్షించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments