Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి గుప్పిట్లో భారత్.. 24 గంటల్లో 459మంది మృతి

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:23 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 11,25,681 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..72,330 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్టోబర్ ప్రారంభంలో ఈ స్థాయి విజృంభణ కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి చేరగా.. 1,62,927 మంది ప్రాణాలు కోల్పోయారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 5,84,055 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 4.55 శాతానికి చేరింది. నిన్న 40,382 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.14కోట్ల పైచిలుకు మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా..రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది.
 
ఆదివారం, హోలీ సెలవుల కారణంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో కొత్త కేసులు తగ్గినట్లు కనిపించాయి. కానీ, మళ్లీ ఇప్పుడు కరోనా అసలు తీవ్రత కనిపిస్తోంది. మహమ్మారితో అతలాకుతలం అవుతోన్న మహారాష్ట్రలో.. తాజాగా 39,544 కొత్త కేసులు వెలుగుచూశాయి. 227 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో.. సుమారు సగం మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే వెలుగుచూడటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments