Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:17 IST)
ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన వైద్యుల సంఖ్య ఢిల్లీలో మూడుకు చేరింది. ఇప్పటికే కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చిన ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిని పూర్తిగా మూసివేసి, ఆమెతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 
 
మరోవైపు, తాజాగా మరో ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకింది. వారిద్దరూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెసిడెంట్‌ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ కరోనా రోగులు ఉంచిన ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ ఇద్దరు వైద్యులు మహిళలే. ఒకరు కోవిద్-19 యూనిట్‌లో పని చేస్తున్నారు. మరొకరు జూనియర్ మహిళా వైద్యురాలు. ఈమె బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతోంది. 
 
అయితే, ఈ జూనియర్ వైద్యురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లివచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిద్దరూ ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments