Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12మంది బాలికలకు పాజిటివ్

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (21:47 IST)
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ)లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో స్కూల్ లో ఉన్న అందరికీ కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్ లు చేయించారు అధికారులు. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన 12 మంది విద్యార్థులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు అధికారులు. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 132 మంది స్టూడెంట్స్, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగటివ్ రాగా, 12 మంది బాలికలకు మాత్రం పాజిటివ్ వచ్చింది. 
 
ర్యాపిడ్ టెస్ట్‌లలో నెగటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టీపీసిఆర్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేశారు అధికారులు. అయితే.. ఈ రిపోర్టులు రేపు రానున్నాయి. ఆ రిపోర్టుల్లో ఇంకా ఎవరికైనా పాజిటివ్‌ వస్తుందోననే భయంలో ఇటు సిబ్బంది అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments