ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు.. చైనాలో మళ్లీ కలకలం

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (12:54 IST)
చైనా వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన వేల ఐస్క్రీం కార్టన్లను వెనక్కి తీసుకుంటోంది సంస్థ.
 
బీజింగ్‌కు సమీపాన ఉన్న తియాన్జిన్లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాచ్లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. 390 కార్టన్లు తియాన్జిన్లో అమ్మినట్లు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
 
అయితే ఐస్క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారో లేదో తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థను సీజ్ చేసి, అందులోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, చైనాలో ఆదివారం 109 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో 72 కేసులు హెబే ప్రావిన్స్లోనే వెలుగుచూశాయి. ఇక్కడే చైనా ప్రభుత్వం భారీ ఐసోలేషన్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. దేశంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments