Webdunia - Bharat's app for daily news and videos

Install App

113 దేశాలకు వ్యాపించిన కరోనా.. మృతులు 4009 పైమాటే...

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (14:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వైరస్‌ పాకింది. కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4009కి చేరింది. ఇప్పటివరకు 1,14,285 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇటలీలో సోమవారం ఒక్కరోజే 97 మంది మృతి చెందగా, 1797 కేసుల నమోదయ్యాయి. చైనాలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. 
 
ప్రాణాలు తీసిన వదంతులు 
ఇరాన్‌లో వదంతులు ప్రాణాలు తీశాయి. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో ఇరాన్‌ అతలాకుతలమైపోతుంది. 
 
మంగళవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 595 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 237 మంది మృతి చెందారు. మరో ఏడు వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. 
కరోనా ప్రభావం ఖైదీలపై ఉండటంతో 70 వేల మంది ఖైదీలను ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments