Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో మనిషి మాంసంతో కూర... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ తాగుబోతు పీకలవరకు మద్యం సేవించాడు. దీంతో కైపు నషాళానికెక్కింది. ఈ మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడనే విషయం మరిచిపోయాడు. దీంతో నేరుగా శ్మశానానికి వెళ్లి... ఓ మృతదేహం చేతిని నరికి ఇంటికి తెచ్చాడు. ఆ చేయి మాంసంతో కూర చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ టిక్కోపూర్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) అనే పచ్చి తాగుబోతు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతనో సైకోగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటీవల తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. 
 
అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను వేరుచేసి, మాంసాన్ని తీసి కూరవండాడు. 
 
ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు ఆమె సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments