Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో మనిషి మాంసంతో కూర... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ తాగుబోతు పీకలవరకు మద్యం సేవించాడు. దీంతో కైపు నషాళానికెక్కింది. ఈ మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడనే విషయం మరిచిపోయాడు. దీంతో నేరుగా శ్మశానానికి వెళ్లి... ఓ మృతదేహం చేతిని నరికి ఇంటికి తెచ్చాడు. ఆ చేయి మాంసంతో కూర చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ టిక్కోపూర్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) అనే పచ్చి తాగుబోతు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతనో సైకోగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటీవల తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. 
 
అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను వేరుచేసి, మాంసాన్ని తీసి కూరవండాడు. 
 
ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు ఆమె సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments