వంద సంఖ్యకు దిగువకు చేరుకున్న కరోనా మరణాలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:32 IST)
దేశంలో కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. మంగళవారం లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య కేవలం 94 మాత్రమే. ఇది భారత్ పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో ఇప్పటివరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. 
 
ఇకపోతే, కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి శాతం 97కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. 
 
ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది. దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  
 
ఇంకోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష

జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments