Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విజృంభణ.. ఏపీలో కోవిడ్ కేసుల సంగతేంటి?

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (18:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,901 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 67 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,846కు చేరింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 95,733 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,57,008 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,57,587కు పెరిగింది. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 45,27,593 శాంపిల్స్‌ పరీక్షించారు. 
 
తాజా కోవిడ్ మరణాలు పరిశీలిస్తే.. కడపలో 9, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది చొప్పున, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణా జిల్లా, కర్నూల విశాఖలలో ఐదుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, అనంతపురం, తూర్పు గోదావరిలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతించెందారు. 
 
ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి 10,292 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనాబారిన పడి ఇప్పటి వరకు 457008 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 95733కు తగ్గాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments