Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా కరోనావైరస్ తగ్గుముఖం, కొత్తగా 753 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (19:38 IST)
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 టెస్టులు నిర్వహించగా అందులో 753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6881కి చేరుకుంది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకొక్కరు చొప్పున మరణించారు.
 
అటు జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించగా అనంతపురం 4, చిత్తూరు 87, తూర్పు గోదావరి 130, గుంటూరు 50, కడప 66, కృష్ణా 76 ,కర్నూలు 12, నెల్లూరు 14, ప్రకాశం 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, పశ్చిమ గోదావరి 216 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments