దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి - 2.60 లక్షల కేసులు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (10:31 IST)
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 2,58,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 385 మంది ఉన్నారు. ఈ వైరస్ నుంచి మరో 1,51,740 మంది విముక్తి పొందారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,56,341 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది.
 
మరోవైపు, ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 8,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 70.37 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, గడిచిన 24 గంటల్లో ఏకంగా 13,13,444 మందికి ఈ పరీక్షలు చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments