Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికే కరోనా కిట్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Webdunia
శనివారం, 11 జులై 2020 (12:36 IST)
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటిలోనే ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్టు పంపాలని నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా అందించనుంది.
 
హైదరాబాదు కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశాలు జారీచేశారు.
 
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 32,224గా ఉండగా ఇందులో 12,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు 10 వేల మంది ఇళ్ల నుండే చికిత్స పొందుతున్నారు.
 
కిట్‌లో గల పరికరాలు:-
1. శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు.
2. హైడ్రాక్సీక్లోరోక్సిన్.
3. పారాసెటమల్.
4. యాంటీబయాటిక్స్.
5. విటమిన్ సి, ఇ, డి3 తదితరాలు.
6. లివోసెటిరిజైన్
7. ఎసిడిటీని తగ్గించే మాత్రలు.
8. ఏం చేయాలి, ఏం చేయకూడదు? అని అవగాహన పెంపొందించే పుస్తకం.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments