దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 993 కొత్త కేసులు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (15:19 IST)
భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మరోమారు దాదాపు 14వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 13వేల 993 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది. 
 
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం.
 
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా నిన్న(ఫిబ్రవరి 19,2021) 6వేల 112 కేసులు రికార్డ్ అయ్యాయి. అక్టోబర్(2020) 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అక్టోబర్ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
 
పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ..అందరికన్నా ముందు ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో రోజూవారీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 
 
కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ముంబైలో నిన్న ఒక్క రోజే 13వేల 592మందికి జరిమానా విధించారు. జరిమానాల రూపంలో 27లక్షల 18వేల రూపాయలు వసూలు చేశారు.
 
2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి 19వరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగినందుకు 15లక్షల 71వేల 679మందికి జరిమానా విధించారు. వారి నుంచి 31కోట్ల 79లక్షల 43వేల 400 రూపాయలు వసూలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments