తెలంగాణలో కరోనా: 1,278 కొత్త కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం

Webdunia
శనివారం, 11 జులై 2020 (11:25 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ శుక్రవారం గుర్తించిన కేసులు అంతకుముందుతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మొత్తం 1,278 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,680గా ఉన్నాయి.
 
గత 24 గంటల్లో 1013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 19,205కు చేరింది. ఇక శుక్రవారం మరో 8 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 339కి చేరింది.
 
శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 762 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 171 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 85 కొత్త కరోనా కేసులను గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments