Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా: 1,278 కొత్త కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం

Webdunia
శనివారం, 11 జులై 2020 (11:25 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ శుక్రవారం గుర్తించిన కేసులు అంతకుముందుతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మొత్తం 1,278 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,680గా ఉన్నాయి.
 
గత 24 గంటల్లో 1013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 19,205కు చేరింది. ఇక శుక్రవారం మరో 8 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 339కి చేరింది.
 
శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 762 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 171 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 85 కొత్త కరోనా కేసులను గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments