Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మందు కనిపెట్టానంటూ దాన్ని తనపైనే ప్రయోగించుకున్నాడు, మరణించాడు

Corona Virus
Webdunia
శుక్రవారం, 8 మే 2020 (14:35 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను చంపేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా చెన్నైలో కరోనాను కట్టడి చేసేందుకు తను మందును కనుగొన్నానంటూ 47 ఏళ్ల శివనేసన్ అనే ఫార్మసిస్ట్ ఒకరు ఆ మందును తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయాడు.  
 
ఈ ఘటన డాక్టర్ ఇంట్లో జరగడంతో, ఫార్మసిస్ట్‌తో పాటు మందులు తయారుచేయడంలో డాక్టర్ కూడా పాల్గొన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెరుంగుడి స్థానికుడైన శివనేసన్ ఉత్తరాఖండ్‌లోని ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రైవేట్ బయోటెక్ ల్యాబ్‌లో పనిచేశాడు. ఆ తర్వాత చెన్నైలో అదే కంపెనీకి చెందిన శాఖలో పనిచేస్తూ వున్నాడు.
 
గత రెండు నెలలుగా కరోనా వైరస్ పనిపట్టాలని అతడు మందును కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెపుతున్నారు. ఈ క్రమంలో చివరకు తను అనుకున్న మందును కనిపెట్టేశానంటూ చెన్నైలోని తేనాంపేటలోని ఒక డాక్టర్ ఇంటికి మందును తీసుకువచ్చాడు.
 
ఆ మందును డాక్టర్ రాజ్‌కుమార్ కొంత మోతాదులో సేవించగా శివనేసన్ ఎక్కువ తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనితో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments