Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌తో పులివెందులలో అంగన్వాడీ టీచర్ మృతి

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:40 IST)
దేశంలో వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకున్న కొందరు అస్వస్థతకు గురవ్వడం కొందరు చనిపోవడంతో వ్యాక్సిన్ విషయంలో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ టీచర్ మృతి చెందారు.  ఈ  విషాదకర సంఘటన కడప జిల్లా, పులివెందులలో చోటుచేసుకుంది. 
 
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టి.నారాయణమ్మ అనే అంగన్ వాడీ టీచర్ మృతి చెందింది. పులివెందుల పట్టణానికి చెందిన నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటినుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారని ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. టైఫాయిడ్ జ్వరంగా వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.
 
ఆస్పత్రిలో చికిత్స తర్వాత కూడా నారాయణమ్మకు జ్వరం తగ్గలేదని దీంతో గురువారం ఆమెను ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. ఇంటికి వచ్చిన గంట సమయం లోపే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments