Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona: 6లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు, కొత్తగా 51,667 కేసులు,1,329 మరణాలు

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (15:38 IST)
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17,35,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..51,667 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 4.4 శాతం తగ్గుదల కనిపించింది. తాజాగా 1,329 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,34,445కి చేరగా.. 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక నిన్న 64,527 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,91,28,267కి చేరాయి. రికవరీ రేటు 96.66 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 2.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 6 లక్షలకు పడిపోయాయి. మరోపక్క సోమవారం నుంచి కరోనా టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 60,73,319 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 30,79,48,744కి చేరింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments