Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వెయ్యి మంది కరోనా పేషంట్లు మాయం?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న పట్టణాల్లో తిరుపతి ఒకటి. కానీ, ఈ పట్టణంలో కరోనా వైరస్ బారినపడే రోగులకు తిరుపతి వైద్యాధికారులు ముచ్చెమటలు పోయిస్తున్నారు. 
 
గత రెండు నెలల కాలంలో తిరుపతిలో 9,164 మంది కరోనా బారిన పడగా... ప్రస్తుతం 7,270 మంది ఆచూకీ మాత్రమే లభించింది. మిగిలిన 1,049 మంది రోగులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. 
 
వారు ఇచ్చిన ఇంటి నెంబర్లలో కూడా వారు లేరు. వారి ఫోన్ నంబర్లు కూడా పని చేయడం లేదు. దీంతో వారి కోసం అధికారులు వేట ప్రారంభించారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు గుర్తించారు.
 
కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఆ తర్వాత టెస్టు రిపోర్టులు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఇతరులకు కూడా కరోనాను అంటిస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments