Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 50, తెలంగాణలో 157 కేసులు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:01 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,605 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,161 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.
 
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 29,666 మందికి కరోనా పరీక్షలు చేయగా 157 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 163 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988కి చేరింది. ఇప్పటివరకు కోవిడ్-19తో 1,613 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,92,578 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 729 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 27 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments