2,301కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 56 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:55 IST)
కరోనా కేసుల సంఖ్య దేశంలోనూ పెరిగిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,301కి చేరింది. కరోనా వైరస్‌తో వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు దొరకడం లేదు.  తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. 
 
ఇంకా రాష్ట్రాల వారీగా కూడా ఎన్ని కరోనా కేసులు నమోదైనాయో విడుదల చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా అత్యధికంగా మహారాష్ట్రలో 356 కరోనా కేసులు నమోదైనాయి. అత్యల్పంగా అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా 2,301 మందికి కరోనా సోకగా, 157మంది డిశ్చార్జ్ అయ్యారు. భారతదేశం మొత్తంగా 56 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు.
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా గత మూడు రోజులుగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తెలంగాణను క్రాస్ చేసి ఏకంగా 161కు చేరుకుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments