Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:30 IST)
దేశంలో కొత్తగా మరో 42909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,27,37,939కి చేరింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 34,763 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో క‌రోనాతో మ‌రో 380 మంది మృతి చెందారు. ఈ మృతుల సంఖ్యతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 4,38,210కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,19,23,405 మంది కోలుకున్నారు. 
 
3,76,324 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 63.43 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,836 కేసులు న‌మోదు కాగా, 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఆదివారం 58,335 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య మొత్తం 6.57 లక్షలకు చేరింది. వైర్‌సతో మరొకరు మృత్యువాత పడటంతో మరణాల సంఖ్య మొత్తం 3,870కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,15,650 మంది తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో ఆ సంఖ్య మొత్తం 1.31 కోట్లకు చేరింది. మరో 60 వేల మంది రెండో డోసు తీసుకోవడంతో ఆ డోసు తీసుకున్న వారి సంఖ్య మొత్తం 45 లక్షలకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments