Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో కరోనా కేసులన్నీ ఆ రాష్ట్రాల వచ్చిన వారి నుంచే...

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. ఈ జిల్లాలో నమోదైన కేసులన్నీ బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి వచ్చిన వారికి చెందినవే కావడం గమనార్హం. 
 
తాజాగా ఆదివారం చిత్తూరులో ఆరు కరోనా కేసులు నమోదుకాగా వాటిలో నలుగురు చెన్నైకు చెందిన వారు. చెన్నై నుంచి  గొడుగుమూరుకు వచ్చిన భార్యభర్తలకు వలంటీర్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. 
 
అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సలు చేసుకుని బంధువుల ఇంటికి వచ్చిన అత్తా, కోడలు రెడ్డీస్‌ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు. వారికి పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది.  
 
అలాగే, 25వ డివిజన్‌లోని బాలాజీ కాలనీకి చెందిన ఓ అమ్మాయి స్వీడన్‌ నుంచి రెండు రోజుల క్రితం నగరానికి రాగా కరోనా వచ్చింది. రాంనగర్‌కాలనికి చెందిన హోంగార్డుకు ఇది వరకే కరోనా సోకగా.. తాజాగా ఆయన భార్యకు పాజిటివ్‌ వచ్చింది. 
 
కాగా, చెన్నైలో కరోనా విళయతాండవడం చేస్తుండటంతో సమీప మండలాలతో పాటు చిత్తూరుకు చాలా మంది బంధువులు వస్తున్నారు. వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. వీరివల్ల స్థానికంగా మరికొందరికి సోకే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments