Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు అంటే లెక్కలేదు.. బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (22:32 IST)
brazil
బ్రెజిల్ దేశాన్ని కరోనా అట్టుడికిస్తోంది. కరోనా విషయంలో బ్రెజిల్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు 16 లక్షలకు పైగా కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కూడా కోవిడ్ సోకింది. ఆయన కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటిక్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
దీనికి ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నిగిటివ్‌నే అని తేలింది. ప్రస్తుతం చేసుకున్నది మూడవసారి. ఇకపోతే.. కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే నడించింది. దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన అర్థం లేనివిగా కొట్టి పారేశారు. 
 
ఇక కరోనా టెస్టు తరుచూ చేసుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని తెలిపారు. కానీ జైర్ బోల్సోనారో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టింపు లేదని, కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments